రూ. కోటి ఇచ్చిన చిరు.. థాంక్స్ చెప్పిన మురళీ మోహన్

 చిరంజీవి చేసిన సహాయంపై హర్షం వ్యక్తం చేసిన రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్

Last Updated : Feb 20, 2018, 10:29 PM IST
రూ. కోటి ఇచ్చిన చిరు.. థాంక్స్ చెప్పిన మురళీ మోహన్

మెగాస్టార్, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజమండ్రిలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజీ కోసం కోటి రూపాయల నిధులు అందించారు. రాజ్యసభ ఎంపీ అయిన చిరంజీవి.. మెడికల్ కాలేజ్ కొత్త భవనం నిర్మాణం కోసం తన ఎంపీ లాడ్స్ నిధుల కింద ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. చిరంజీవి చేసిన సహాయంపై హర్షం వ్యక్తం చేసిన సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్.. తాజాగా చిరుని ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు చెప్పారు. 

చిరు, మురళీ మోహన్ ఇద్దరూ రాజకీయాల్లో రెండు వేర్వేరు పార్టీలకు చెందిన వారే అయినప్పటికీ.. సినీ కుటుంబానికి చెందిన వారిగా ఆ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం చిరు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వుండగా మురళీ మోహన్ టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా వున్నారు. 'మనవూరి పాండవులు', 'గ్యాంగ్ లీడర్' వంటి హిట్ సినిమాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించి ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. 

Trending News