మళ్లీ పోరాట యాత్రకు సిద్ధమైన జనసేనాని పవన్ కల్యాణ్

పోరాట యాత్రకు జనసేనాని సిద్ధం

Last Updated : Jun 21, 2018, 03:07 PM IST
మళ్లీ పోరాట యాత్రకు సిద్ధమైన జనసేనాని పవన్ కల్యాణ్

సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ పోరాట యాత్రకు సిద్ధమవుతున్నారు. రంజాన్ సందర్భంగా జనసేనకు సేవలు అందిస్తోన్న ముస్లిం సిబ్బంది కోసం ఇటీవల తన యాత్రకు విరామం ఇచ్చిన పవన్ కల్యాణ్ మళ్లీ ఈ నెల 26 నుంచి విశాఖ జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అంతకన్నా ముందుగా ఈ నెల 23 నుంచి 25 వరకు విజయవాడలో పర్యటించనున్నారు. 25న సాయంత్రానికి విజయవాడ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి విశాఖకు బయల్దేరుతారు. 26 నుంచి విశాఖ జిల్లాలో మలివిడత పోరాట యాత్ర ప్రారంభించనున్నట్టు జనసేన ప్రకటించింది. జిల్లాలో పవన్ పోరాట యాత్ర 3, 4 రోజుల పాటు కొనసాగనుంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంతోపాటు ఉత్తరాంధ్ర మేధావులతోనూ పవన్ సమావేశం కానున్నారు. ఈమేరకు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 

 

విశాఖ జిల్లాలో యాత్ర పూర్తయిన అనంతరం పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాకు తమ నాయకుడు రానున్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన పోరాట యాత్ర కోసం తూర్పు గోదావరిలోని పార్టీ శ్రేణులు యాత్ర కోసం ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Trending News