పాక్ లో 'ప్యాడ్‌మ్యాన్' చిత్రంపై నిషేధం

'ప్యాడ్‌మ్యాన్' సినిమాను పాకిస్తాన్ లో నిషేధించారు.

Last Updated : Feb 11, 2018, 01:32 PM IST
పాక్ లో 'ప్యాడ్‌మ్యాన్' చిత్రంపై నిషేధం

బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ప్యాడ్‌మ్యాన్' సినిమాను పాకిస్తాన్‌లో నిషేధించారు. రుతుక్రమంపై సాగే ఈ సినిమాకు అనుమతి ఇచ్చేందుకు ఆ దేశ ఫెడరల్ సెన్సార్ బోర్డు (ఎఫ్‌సీబీ) అంగీకరించలేదు. ఇలాంటి సినిమా మా ఆచార, వ్యవహారాలకు విరుద్ధం, ఇక్కడ సినిమా విడుదల చేసేందుకు అంగీకరించబోం అని ఎఫ్‌సీబీ సభ్యుడు ఇషాక్‌ అహ్మద్ తెలిపారు. నిషిద్ధ అంశంతో తెరకెక్కించిన ప్యాడ్‌మ్యాన్‌ను విడుదల చేయబోమని, ఆ సినిమాకి ధ్రువీకరణ పత్రం ఇవ్వబోమని పంజాబ్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు కూడా స్పష్టంచేసింది.

ఆర్. బల్కీ దర్శకత్వం వహించిన 'ప్యాడ్‌మ్యాన్' చిత్రంలో  రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ లు ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ చిత్రం విడుదలైన మొదటిరోజే రూ.10.26 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో రూ.50 కోట్లు దాటిపోతుందని భావిస్తున్నారు.

Trending News