ట్రీట్‌మెంట్ కోసం వైజాగ్ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ ట్రీట్‌‌మెంట్ నిమిత్తం వైజాగ్ రానున్నారని పలు పత్రికలు తెలపడం గమనార్హం

Last Updated : Feb 8, 2018, 05:58 PM IST
ట్రీట్‌మెంట్ కోసం వైజాగ్ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ ట్రీట్‌‌మెంట్ నిమిత్తం వైజాగ్ రానున్నారని పలు పత్రికలు తెలపడం గమనార్హం. ఇప్పటికే 60 ఏళ్ళు పై బడిన చిరంజీవి ఓ ప్రత్యేకమైన నేచురోపతి ట్రీట్‌మెంట్ కోసం విశాఖపట్నం వస్తున్నారని సమాచారం. ఈ ట్రీట్‌మెంట్ వల్ల శరీర ఛాయలు కాంతిమంతంగా మారడంతో పాటు చర్మం కూడా రేడియేట్ అవుతుందని చెబుతున్నారు.

అయితే చిరు వైజాగ్ ఎప్పుడు వస్తున్నారు.. ఎక్కడ ఉండబోతున్నారు అన్న విషయానికి సంబంధించి ప్రస్తుతానికి ఏ సమాచారం కూడా లేదు. బహుశా మరో వారంలో ఈ ట్రీట్‌మెంట్‌ను చేయించుకోవడం కోసం వైజాగ్ వచ్చి కొన్నాళ్ళు అదే ప్రాంతంలో బస చేయనున్నారని మాత్రం పలు వార్తలు వస్తున్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన "ఖైదీ నెంబర్ 150" చిత్రంలో ఆయన ఎంతో యంగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించారన్న సంగతి వాస్తవమే. ఈ క్రమంలో సురేంద్ రెడ్డి దర్శకత్వంలోరాబోతున్న "సైరా నరసింహారెడ్డి" చిత్రానికి ఆయన సైన్ చేశారు.

ఈ చిత్రంలో పాత్రకు అనుగుణంగా ఆయన స్టైల్ కూడా మార్చారు. బహుశా పాత్రకు మరింత న్యాయం చేకూర్చేందుకు..ముఖ కవళికలు మరింత తేజోమంతంగా తయారయ్యేందుకు, శరీర దృఢత్వం పెంచుకొనేందుకే ఈ నేచురోపతి ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి చిరు వస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. రూ.150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రామ్ చరణ్ సొంత బ్యానరుపై నిర్మిస్తున్న "సైరా నరసింహారెడ్డి" చిత్రంలో చిరంజీవితో పాటు జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Trending News