నాగ్ మామయ్య సినిమా వాయిదా వేసుకోండన్నారు: సమంత

శైలజా రెడ్డి అల్లుడు, యూ టర్న్ సినిమాలు ఒకేరోజున రిలీజవడంపై నాగ్ రియాక్షన్!

Last Updated : Sep 11, 2018, 04:13 PM IST
నాగ్ మామయ్య సినిమా వాయిదా వేసుకోండన్నారు: సమంత

చైతూ నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా, సమంత నటించిన యూ టర్న్ సినిమా సెప్టెంబర్ 13న ఒకేరోజు రిలీజవుతున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయం మొదటిసారి నాగార్జున దృష్టికి వచ్చినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యుంటారనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా ? ఎందుకంటే, కొడుకు-కోడలు ప్రధాన పాత్రల్లో వేర్వేరుగా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడటం అనేది నాగ్‌కి సంబంధించినంత వరకు మామూలు విషయం కాదు కదా!! ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుకుంటే పర్వాలేదు కానీ అలా కాకుండా అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే, ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోననే భయమే ఎంతో టెన్షన్ పెడుతుంది.

అయితే, తాజాగా యూ టర్న్ ప్రమోషన్స్‌లో భాగంగా తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించిన సందర్భంగా సమంతను ఇంటర్వ్యూయర్ ఇదే ప్రశ్న అడగ్గా.. అందుకు ఆమె బదులిస్తూ నాగ్ రియాక్షన్‌ని అభిమానులతో పంచుకున్నారు. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నాయని మొదటిసారి మామయ్యకు తెలియగానే.. ''అయ్యో అలా ఎందుకు చేస్తున్నారు ? ఏదో ఓ సినిమాను వాయిదా వేసుకోవడానికి వీల్లేదా' అని అన్నారని సమంత తెలిపారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా రెండు సినిమాలను ఒకేరోజున విడుదల చేయాల్సి వస్తోందని చెప్పి వివరించామని సమంత తన ఫేస్‌బుక్ చాట్‌లో వివరించారు.

Trending News