అల్లు అర్జున్‌ సైకత శిల్పం చెక్కిన ఫ్యాన్స్

స్టైలిష్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఏప్రిల్ 8వ తేదిన ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని అల్లు అర్జున్ అభిమానులు విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో ఓ సైకత శిల్పాన్ని నిర్మించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతీ మానస్ శేషు ఈ సైకత శిల్పాన్ని తయారుచేశారు. 

Last Updated : Apr 7, 2018, 08:23 PM IST
అల్లు అర్జున్‌ సైకత శిల్పం చెక్కిన ఫ్యాన్స్

స్టైలిష్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఏప్రిల్ 8వ తేదిన ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని అల్లు అర్జున్ అభిమానులు విశాఖపట్నం ఆర్కే బీచ్ ప్రాంతంలో ఓ సైకత శిల్పాన్ని నిర్మించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతీ మానస్ శేషు ఈ సైకత శిల్పాన్ని తయారుచేశారు. ఆ సైకత శిల్పం ఇప్పుడు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

"హ్యపీ బర్త్ డే అల్లు అర్జున్ ఫ్రమ్ వైజాగ్ ఫ్యాన్స్" అని ఆ శిల్పంపై చెక్కించారు ఆయన అభిమానులు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమాలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే.  రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. వక్కంతం వంశీ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మారబోతున్నారు

‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక కాగా.. అర్జున్ సర్జా, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, బోమన్ ఇరానీ, ఠాకూర్ అనూప్ సింగ్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. 1 జనవరి 2018 తేదిన విడుదలైన ఈ సినిమా టీజర్ ఒక రోజులోనే 10 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడం విశేషం
 

Trending News