'ఫిదా' హీరోయిన్ తో శేఖర్ కమ్ముల మరో లవ్ స్టోరీ

                                 

Last Updated : Aug 7, 2018, 04:18 PM IST
'ఫిదా' హీరోయిన్ తో శేఖర్ కమ్ముల మరో లవ్ స్టోరీ

హైదరాబాద్: లవ్ స్టోరీస్ డైరెక్టర్ గా పేరుగాంచిన దర్శకుడు శేఖర్ కమ్ముల ..మరో వండర్ ఫుల్ లవ్ స్టోరీకి తెరపైకి ఎక్కించేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన డైరక్షన్ లో సాయిపల్లవి హీరోయిన్ గా తీసిన 'ఫిదా' మూవీ ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ సీన్ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో తన సరికొత్త లవ్ స్టోరీకి హీరోయిన్ గా సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ విషయం సాయిపల్లవితో సంప్రదించగా ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.. ఇక డేట్స్ కేటాయించడమే తరువాయని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

హీరోగా విక్రం తనయుడి పరిచయం 

మరో విశేషం ఏమిటంటే... ఈ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల ప్రముఖ నటుడు విక్రం తనయుడు ధృవ్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. తెలుగు తెరపై కనిపించేందుకు ధృవ్ ఆసక్తి చూపుతున్నాడని..ఇక యంగ్ అండ్ యాక్టివ్ హీరోయిన్ సాయిపల్లవి సరసన అనగానే ఇక ఏమాత్రం ఆలోచించకుండా ధృవ్ ఓకే అన్నట్లు తెలిసింది.

అక్టోబర్ నుంచి షూటింగ్ ?

గతంలో శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్'.. ఆమధ్య వచ్చిన 'ఫిదా' వంటి సినిమాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయో తెలిసిందే. లవ్ స్పెషలిస్ట్ డైరెక్టన్ లో ధృవ్, సాయిపల్లవీ జంటగా తెరపైకి వస్తున్నఈ మూవీ  ఏ మేరకు ఆకట్టుకుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. కాగా ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు తెలిసింది. కాగా అక్టోబర్ నుంచి దీని షూటింగ్ ప్రారంభమౌతుందని టాక్.  

Trending News