సినీనటుడు మోహన్‌బాబుకు మాతృవియోగం

టాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు మంచు మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ అనారోగ్య కారణాల వలన ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

Last Updated : Sep 20, 2018, 07:29 PM IST
సినీనటుడు మోహన్‌బాబుకు మాతృవియోగం

టాలీవుడ్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు మంచు మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ అనారోగ్య కారణాల వలన ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆమె పార్థివదేహాన్ని తిరుపతిలోని విద్యానికేతన్ ప్రాంగణంలోని నివాసానికి తరలించారు. విదేశాల్లో ఉన్న మోహన్ బాబు తన తల్లి మరణవార్త వినగానే హుటిహుటిన తిరుపతికి బయలుదేరారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని.. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి చేరుకున్నారు. ఇంకొద్ది గంటల్లో ఆయన విద్యానికేతన్ ప్రాంగణానికి రానున్నారు. మంచు లక్ష్మమ్మ మరణవార్తతో తిరుపతిలోని విద్యానికేతన్ పరిసరాలన్నీ విషాదంతో నిండిపోయాయి. శుక్రవారం ఆమె అంత్యక్రియలు జరపనున్నట్లు మోహన్ బాబు కుటుంబసభ్యులు తెలిపారు.

మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ మంచు ఫేస్ బుక్ వేదికగా ఈ విషాదభరిత వార్తను తన అభిమానులతో పంచుకున్నారు. "మా తండ్రిగారికి జన్మనిచ్చిన గొప్ప మహిళకి వీడ్కోలు ఎలా చెప్పగలను. ఆమె ఓ శక్తిమంతమైన మహిళ. చాలా ప్రాక్టికల్‌గా జీవించేవారు. తన బిడ్డల బాగోగుల కోసమే నిరంతరం తపించేవారు. కచ్చితంగా ఇది వీడ్కోలకు సమయం కాదు. మమ్మల్ని ఆమె ఎప్పటికీ దీవించాలని కోరుకుంటున్నాం. ఇట్లు నీ మనవళ్లు, మని మునివళ్లు. నీవు ఆ వైపు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఎప్పుడూ మాతోనే ఉంటారు" అని పోస్టు చేశారు. 

అలాగే మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్ కూడా ఫేస్బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. "మా నాన్నమ్మ లక్ష్మమ్మ గారు ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం నాన్నమ్మ. మేము ఈ సమయంలో దేశంలో లేకపోవడం అనేది మాత్రం గుండెలను తొలిచేస్తున్నంత బాధను కలిగిస్తుంది. అసలు మా ఊహకే అందని వార్త ఇది. ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక" అని పోస్టు చేశారు. 

Trending News