జాతీయ గీతం వింటూ భావోద్వేగానికి గురైన ఐశ్వర్య

జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కంటతడి పెట్టారు.

Last Updated : Sep 8, 2018, 05:17 PM IST
జాతీయ గీతం వింటూ భావోద్వేగానికి గురైన ఐశ్వర్య

జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కంటతడి పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలో ఐఎంసీ డబ్ల్యూ ఎగ్జిబిషన్ 2018లో ఐశ్వర్యతో పాటు షబానా ఆజ్మీ, సోను నిగమ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

బాలీవుడ్ ఫ్యాన్స్ అకౌంట్‌లో షేర్ అయిన వీడియోలో.. ఐశ్వ‌ర్య‌రాయ్ జాతీయ గీతం పూర్తైన త‌ర్వాత క‌న్నీళ్ళు పెట్టుకుంది. ఐష్‌ కంటతడి పెట్టడం.. పలువురు సైగలు చేసిన తర్వాత కన్నీళ్లు తుడ్చుకోవడం మీడియా కంట పడ్డాయి.

2017లో ఆస్ట్రేలియాలో జరిగిన భారతదేశ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎంఎం)లో జాతీయ జెండాను ఎగురవేసిన మొట్టమొదటి మహిళా నటిగా ఐశ్వర్య రాయ్ ఖ్యాతి గాంచింది. ఈ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ.. అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తనకు, తన కుమార్తె ఆరాధ్యకు ఎప్పటికీ గుర్తుంటాయని ఆమె చెప్పారు.

ఐశ్వర్య ఇటీవల 'ఫెన్నీ ఖాన్' అనే చిత్రంలో నటించారు. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఐష్ ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ చిత్రం 'గులాబ్ జమాన్' అనే చిత్రంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించనుంది.

 

Trending News