దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ

రైలులోని బీ3, బీ7 బోగీల్లోని ప్రయాణికులను దోచుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

Last Updated : Jan 17, 2019, 11:46 AM IST
దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ

న్యూఢిల్లీ: జమ్ము-ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో గురువారం తెల్లవారిజామున గుర్తుతెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఢిల్లీ శివార్లలో ఈ ఘటన జరిగింది. రైలులోని బీ3, బీ7 బోగీల్లోని ప్రయాణికులను దోచుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు చోరీ ఘటనపై ఆర్‌పీఎఫ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు ఉత్తర రైల్వే సీపీఆర్వో తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోనున్నట్టు సీపీఆర్వో పేర్కొన్నారు. తరచుగా రైళ్లలో జరుగుతున్న దోపిడీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Trending News