జియోకి షాక్ ఇస్తున్న వొడాఫోన్

జియో.. భారతీయ టెలికాం రంగంలో ఎంత సంచలనాన్ని నమోదు చేసిందో ఎవరికీ తెలియని విషయం కాదు. ఉచిత డేటా ఆఫర్లతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయాన్ని మొబైల్ వినియోగదారులకు అందివ్వడమే ప్రధాన లక్ష్యంగా జియో మార్కెట్‌లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు జియో ఆఫర్లకు కౌంటర్ ఇవ్వడానికి వొడాఫోన్ తాజాగా ఓ సరికొత్త ఆఫర్‌తో వచ్చింది.

ఈ ఆఫర్ ప్రకారం 28 రోజులకు గాను రూ.255 రీఛార్జి చేయించుకుంటే ప్రిపెయిడ్‌ వినియోగదారులకు రోజూ 2జీబీ డేటాను అందించనున్నట్లు వొడాఫోన్ యాజమాన్యం తెలిపింది. అలాగే ఇదే ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే ప్రతీ రోజు 100 ఉచిత ఎసెమ్మెస్‌ల సౌకర్యాన్ని కూడా ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగించుకోవచ్చు.

జియో కూడా ప్రస్తుతం ఇలాంటి ఆఫరే అందిస్తోంది. 28 రోజులకు రూ.299తో రీఛార్జి చేసుకుంటే రోజుకు 3జిబి డేటాను పొందవచ్చన్నది ఆ ప్లాన్ స్కీమ్. అలాగే ఎయిర్ టెల్ అయితే  కేవలం రూ.249కే 2జీబీ డేటాను అందిస్తోంది. ఇటీవలే ఎయిర్ టెల్ రెండు ప్రీ పెయిడ్ ప్లాన్‌లు కూడా తీసుకొచ్చింది. అందులో రూ.458 క్రింద 70 రోజులపాటు.. ప్రతీ రోజు 1 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.

English Title: 
Jio gives shock to Vodafone
News Source: 
Home Title: 

జియోకి షాక్ ఇస్తున్న వొడాఫోన్

జియోకి షాక్ ఇస్తున్న వొడాఫోన్
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
జియోకి షాక్ ఇస్తున్న వొడాఫోన్