ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతం!!

భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్

Last Updated : Jul 19, 2018, 03:00 PM IST
ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతం!!

చత్తీస్‌ఘడ్ మరోమారు తుపాకుల మోతతో మార్మోగింది. గురువారం ఉదయం దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. హతమైన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్, ఎస్టీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడినట్టు తెలుస్తోంది. 

ఘటనాస్థలం నుంచి 2 ఐఎన్ఎస్ఏఎస్ రైఫిల్స్, రెండు .303 రైఫిల్స్, మరో 12 బోర్ రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.   

Trending News