చంబుర్‌లోని పెట్రోలియం ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ముంబైలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 

Last Updated : Aug 8, 2018, 04:29 PM IST
చంబుర్‌లోని పెట్రోలియం ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ముంబైలోని భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెంబూర్‌లోని టాటా పవర్ వద్ద భారత్‌ పెట్రోలియం (పీసీఎల్)ప్లాంట్‌కు చెందిన రిఫైనరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని చంబుర్‌‌లో బుధవారం మధ్యాహం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్ధలికి 7 ఫైరింజన్లు, 2 ఫోమ్ టెండర్స్, 2 జంబో ట్యాంకర్లు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి.

 

ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం.. ఘటనాస్థలి వద్ద ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు..ఎవరూ గాయపడలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News