ఈ బిల్లు వస్తే డాక్టరైనా.. ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సిందే..!

భారతదేశంలో వైద్య విద్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో ఒక ప్రత్యేక వైద్య కమీషన్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును శుక్రవారం లోక్ సభలో ప్రవేశబెట్టింది.

Last Updated : Dec 30, 2017, 12:55 PM IST
ఈ బిల్లు వస్తే డాక్టరైనా.. ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాల్సిందే..!

భారతదేశంలో వైద్య విద్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో ఒక ప్రత్యేక వైద్య కమీషన్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును శుక్రవారం లోక్ సభలో ప్రవేశబెట్టింది. ఆ బిల్లు ముఖ్యంశాలు ఇవే

*జాతీయ వైద్య కమీషన్ క్రింద నాలుగు స్వతంత్ర మండలులు ఏర్పాటు చేస్తారు. ఇవి వైద్య విద్యార్థుల వార్షిక పరీక్షల ఏర్పాటుతో పాటు, వైద్య విద్యాసంస్థల
ప్రమాణాలను పరిశీలించడం, వైద్యుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తాయి

*ఈ కమీషనుకి సంబంధించి అధ్యక్షుడిని, సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది

*ఈ కమీషను అమలులోకి వస్తే.. భారతదేశం మొత్తం ఆలిండియాలో వైద్య విద్యార్థులందరికీ ఒకే పరీక్ష నిర్వహిస్తారు

*అలాగే వైద్యులు ప్రాక్టీసు ప్రారంభించే ముందు... లైసెన్స్ పొందడం కోసం మరో పరీక్ష కచ్చితంగా పాస్ అవ్వాలి

*అలాగే ఈ కమీషన్ అమలులోకి వస్తే వైద్య కళాశాలలు కొత్తగా సీట్లు పెంచుకోవాలన్నా.. పీజీ కోర్సులు ప్రారంభించాలన్నా వేరే అనుమతి పొందాల్సిన అవసరం లేదు

Trending News