రాష్ట్రపతి, ప్రధానిలకు బోయింగ్ ఫ్లైట్స్

భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తోంది.

Last Updated : Mar 13, 2018, 06:40 PM IST
రాష్ట్రపతి, ప్రధానిలకు బోయింగ్ ఫ్లైట్స్

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి కోసం కేంద్రం ప్రత్యేక విమానాలను సిద్ధం చేస్తోంది. సరికొత్త ఆధునిక విమానాలు 2020 నాటికి అందుబాటులోకి వస్తాయని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలనే ఎయిర్ ఇండియా బోయింగ్ 777-300 ఈఆర్‌లను కొనుగోలు చేశాయి.

ఈ రెండు బోయింగ్ విమానాలను వీవీఐపీలకు అనుగుణంగా మార్పు చేస్తారు. ప్రెస్‌కాన్ఫరెన్స్ రూమ్, వీఐపీ ఎన్‌క్లోజర్‌, అత్యవసర సమయాల్లో  వైద్య సదుపాయంలకు అనుగుణంగా మార్పు చేస్తారు. వైఫై సదుపాయం కలిగిన ఈ విమానాలు క్షిపణుల దాడులనూ తట్టుకోగలవు. ఇవి భారత్ నుంచి నేరుగా యుఎస్‌కు ఎక్కడా ఆగకుండా వెళ్లగలవు. ఇంధనం కోసం మధ్యలో ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఎయిర్ ఇండియా మూడు బోయింగ్-777 విమానాలను ప్రవేశపెట్టింది. 2006లో 68 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. వీటిల్లో రెండు విమానాలను కేవలం వీవీఐపీల కోసమే కేటాయిస్తారు. వీటిని ప్రభుత్వం ఎయిర్ ఇండియా నుంచి కొనుగోలు చేస్తుందని అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేసేందుకు వీలుగా గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,469.50 కోట్లు కేటాయించింది. ఎయిర్ ఇండియా మొత్తం 44 మంది పైలెట్లను వీవీఐపీ విమానాలను నడపడానికి వినియోగిస్తుంది. వీరితో పాటు క్యాబిన్‌ సిబ్బంది, ఇంజనీర్లు, అత్యవసర సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు.

Trending News