ఇషా-ఆనంద్ నిశ్చితార్థానికి తరలివెళ్తున్న ప్రముఖులు

ఇషా-ఆనంద్ నిశ్చితార్థానికి తరలివెళ్తున్న ప్రముఖులు

Last Updated : Sep 22, 2018, 04:58 PM IST
ఇషా-ఆనంద్ నిశ్చితార్థానికి తరలివెళ్తున్న ప్రముఖులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాళ్ గ్రూప్ చీఫ్ అజయ్ పిరమాళ్ కుమారుడు ఆనంద్ నిశ్చితార్థ  వేడుకల్లో పాల్గొనటానికి అనేకమంది ప్రముఖులు శుక్రవారం ఇటలీ బయదేరి వెళ్లారు. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో ఉన్న లేక్ కొమో ఇషా-ఆనంద్ నిశ్చితార్థం మూడురోజుల పాటు ఘనంగా జరగనుంది.

ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఆమె కాబోయే భర్త నిక్ జోనస్ ఇటలీ వెళ్లారు. వీరితోపాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా, అనిల్ కపూర్ కూడా ఈ ఎంగేజ్‌మెంట్ కోసం లేక్ కొమో చేరుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్నాక ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌లు ఈ ఎంగేజ్మెంట్‌లో పూర్తిగా ట్రెడిషనల్ డ్రస్సుల్లో కనిపించారు. బాలీవుడ్‌కి దర్శకుడు కరణ్ జోహార్, శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ కూడా లేక్ కొమో చేరుకున్నారు. మరికొంతమంది సినీ ప్రముఖులు శనివారం చేరుకోనున్నారు. ఈ వీకెండ్‌లో ఇషా-ఆనంద్ ఎంగేజ్‌మెంట్ జరగనుంది. అక్కడే గ్రాండ్‌గా అతిథులకు అంబానీ కుటుంబం పార్టీ ఇవ్వనుంది.

డిసెంబర్‌లో ఇషా-ఆనంద్ వివాహం జరగనుంది. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ తన చిన్ననాటి స్నేహితురాలు ఇషాకు మహాబలేశ్వర్‌లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఇరు కుటుంబాలు లంచ్ పార్టీలో పాల్గొన్నాయి.

 

 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

A sneak peek of #lakecomo where #ishaambani is getting engaged #Italy

A post shared by BOLLYHOLICS (@bollyholics__) on

 

Trending News