కువైట్‌లో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

కువైట్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Last Updated : Apr 2, 2018, 11:56 AM IST
కువైట్‌లో రోడ్డు ప్రమాదం: ఏడుగురు భారతీయులు మృతి

కువైట్: కువైట్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ కువైట్‌లోని బర్గాన్ అనే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆర్టెల్ జాతీయ రహదారిపై రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో పది మందికిపైగా అక్కడిక్కడే మృతి చెందారు. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

కువైట్ ఆయిల్‌ కంపెనీకి చెందిన ఉద్యోగుల బస్సును మరో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని హెలికాఫ్టర్లలో దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో కువైట్ ఆయిల్ కంపెనీ కార్మికులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  మృతుల్లో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Trending News