కేసీఆర్‌పై అభిమానం చాటుకున్న ఎన్నారైలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తమకు వున్న అభిమానాన్ని చాటుకున్నారు యూకేలో స్థిరపడిన పలువురు తెలంగాణ వాసులు.

Last Updated : May 8, 2018, 06:54 PM IST
కేసీఆర్‌పై అభిమానం చాటుకున్న ఎన్నారైలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తమకు వున్న అభిమానాన్ని చాటుకున్నారు యూకేలో స్థిరపడిన పలువురు తెలంగాణ వాసులు. ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజాభిమానాన్ని చూరగొంటున్న సీఎం కేసీఆర్ గౌరవార్థం కేసీఆర్ నాణేలను ముద్రించారు యూకెలో వుంటున్న టీఆర్ఎస్ పార్టీ అభిమానులు. నాణేలకు ఒక వైపు కేసీఆర్ ముఖచిత్రాన్ని, మరో వైపున టీఆర్ఎస్ పార్టీ చిహ్నం కారు బొమ్మను ముద్రించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ స్వయంగా ఈ నాణేలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్ కమిటి మెంబర్ సురేష్ గోపతి మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే ఈ నాణేలను రూపొందించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ పై వున్న అభిమానంతో తయారు చేయించిన ఈ నాణేలను ఆయన చేతుల మీదుగానే విడుదల అవడం మరింత ఆనందంగా ఉందన్నారు. 

కోర్ కమిటి మెంబర్ భాస్కర్ మొట్ట మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో విందు తర్వాత జరిగిన సమావేశంలో ఆయన ఎన్నారైల బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకోవడం సంతోషం కలిగించింది అని అన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తోన్న సీఎం కేసీఆర్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుంది అని అభిప్రాయపడ్డారు. 

Trending News