కోహ్లీ కాళ్లు మొక్కి.. సెల్ఫీ తీసుకున్న వీరాభిమాని

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోజు రోజుకూ వీరాభిమానులు ఎక్కువవుతున్నారు.

Last Updated : May 13, 2018, 03:12 PM IST
కోహ్లీ కాళ్లు మొక్కి.. సెల్ఫీ తీసుకున్న వీరాభిమాని

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోజు రోజుకూ వీరాభిమానులు ఎక్కువవుతున్నారు. శనివారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆడిన మ్యాచ్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ అభిమాని అందరి కళ్లూ కప్పి ఎలాగోలా మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత సమయం చూసి పరుగెత్తుకొని వెళ్లి కోహ్లీ కాళ్ల మీద పడ్డాడు. ఆ తర్వాత సెల్ఫీ తీసుకున్నాడు.

అయితే అనుకోని ఈ హఠాత్పరిణామానికి సెక్యూరిటీ సిబ్బంది కంగుతిన్నారు. వెంటనే గ్రౌండులోకి వచ్చి ఆ అభిమానిని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. అయితే కోహ్లీ అతన్ని విడిచిపెట్టమని.. కొట్టవద్దని సెక్యూరిటీకి చెప్పడంతో అతన్ని విడిచిపెట్టారు. గతంలో ధోనికి కూడా ఇలాంటి అనుభవాలే మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనేకసార్లు ఎదురయ్యాయి. 

ప్రస్తుతం ఆ ఫ్యాన్ విరాట్ కోహ్లీతో తీయించుకున్న సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. అయితే ఎప్పుడైతే కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాన్ మైదానంలోకి అడుగుపెట్టాడో మ్యాచ్‌కు కొంచెంపేపు అంతరాయం కలిగింది. టీవీల్లో  ఆ సంఘటనను ఏ ఛానల్ కూడా ప్రసారం చేయలేదు. కాకపోతే అనేక మంది అభిమానులు ఆ సంఘటనను వీడియో తీసి వాట్సాప్‌లో, ఫేస్బుక్‌లో పంచుకున్నారు. విరాట్ కోహ్లీకి చెందిన ఫ్యాన్ పేజీల్లో కూడా వాటిని షేర్ చేశారు. 

 

Trending News