ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడిన అల్లు అర్జున్!

ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడిన అల్లు అర్జున్

Last Updated : Dec 7, 2018, 08:57 AM IST
ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడిన అల్లు అర్జున్!

హైదరాబాద్: నేడు తెలంగాణలో శాసన సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులు ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టేషన్స్ వద్దకు చేరుకుని ఓటర్లు అందరితోపాటు క్యూలో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఉదయాన్నే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని 152వ నెంబర్ బూత్ వద్దకు చేరుకుని క్యూలో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఇదిలావుంటే, తెలంగాణలోని పలు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు ఆలస్యంగా ప్రారంభమైనట్టు సమాచారం అందుతోంది. హైదరాబాద్ పరిధిలోని నాచారంలో ఉన్న 171, 212, ఎర్రకుంటలోని 187, సాయినగర్‌లోని 212 నెంబర్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

Trending News