కాంగ్రెస్ అభ్యర్థి అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారన్న ఓవైసీ !

కాంగ్రెస్ అభ్యర్థిపై అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలు 

Last Updated : Dec 7, 2018, 01:12 PM IST
కాంగ్రెస్ అభ్యర్థి అర్ధరాత్రి డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేశారన్న ఓవైసీ !

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్ధరాత్రి ఓటర్లకు లంచం ఇవ్వజూపే ప్రయత్నం చేశారని ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈమేరకు ఓ ట్వీట్ చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఖాయమని, ఆ అల్లానే అతడిని ఓడిస్తాడని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఇదిలావుంటే, శుక్రవారం ఉదయమే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే శాస్త్రిపురం పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలోని 317 పోలింగ్ బూత్ వద్ద ఓవైసీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Trending News