దేశంలోని మేధావుల్లో అసదుద్దీన్ ఓవైసీ ఒకరు.. ఇద్దరం కలిసే పనిచేస్తాం : కేసీఆర్

అసదుద్దీన్ ఓవైసీ నాతోనే ఉన్నారు.. ఇద్దరం కలిసే పనిచేస్తాం : కేసీఆర్

Last Updated : Dec 11, 2018, 10:16 PM IST
దేశంలోని మేధావుల్లో అసదుద్దీన్ ఓవైసీ ఒకరు.. ఇద్దరం కలిసే పనిచేస్తాం : కేసీఆర్

హైదరాబాద్: దేశంలో వున్న మేధావుల్లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒకరు అని అభిప్రాయపడ్డారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. తమ ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా వుంటుందని, నిన్న మూడు గంటలపాటు ఇద్దరం కలిసి చర్చించుకున్నామని చెప్పిన కేసీఆర్.. ఓవైసీ తనతోనే కలిసి ఉన్నారని అన్నారు. అంతేకాకుండా ఇకపై కూడా కలిసే పనిచేయబోతున్నాం అని కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యత సాధించిన సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News