తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసన.. స్వామిగౌడ్ కంటికి గాయం!

తెలంగాణ అసెంబ్లీలో నేడు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగడంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Last Updated : Mar 12, 2018, 11:44 AM IST
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసన.. స్వామిగౌడ్ కంటికి గాయం!

ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సమావేశాల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. రాష్ట్రంలో రైతులు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతోంటే, మరోవైపు ప్రభుత్వం మాత్రం వారిని ఆదుకునే దిశగా ఏ చర్యలు తీసుకోవడం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని ముగించారు.

ఇదిలావుంటే, ఈ నిరసనల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గవర్నర్ నరసింహన్ వైపు తన హెడ్ సెట్‌ని విసిరారు. ఈ క్రమంలోనే ఆ హెడ్ సెట్ కాస్తా గవర్నర్‌కి పక్కనే వున్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కి తగిలింది. ఆ హెడ్ సెట్ స్వామి గౌడ్ కంటికి తగలడంతో వెంటనే స్వామిగౌడ్ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఆయన్ని సరోజిని కంటి ఆస్పత్రికి తరలించారు.

 

Trending News