బైక్ కొనివ్వలేదని 10వ తరగతి విద్యార్థి అఘాయిత్యం!

బైక్ కొనివ్వలేదని...

Last Updated : Oct 22, 2018, 01:58 PM IST
బైక్ కొనివ్వలేదని 10వ తరగతి విద్యార్థి అఘాయిత్యం!

తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ 10వ తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఖైరి గ్రామంలో చోటుచేసుకుంది. ఖైరికి చెందిన వాడై శంకర్, కమలాబాయి దంపతుల చిన్న కొడుకు మహదేవ్ (15) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. వాడై మహదేవ్ శనివారం తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని పట్టుపట్టగా వచ్చే ఏడాది కొనిస్తానని శంకర్ కొడుక్కి నచ్చచెప్పాడు. అయితే, తండ్రి చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందని మహదేవ్ అదే రోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.

అదే సమయంలో బావి దగ్గరి నుంచి ఇంటికి వచ్చిన శంకర్, కమలాబాయి దంపతులు జరిగిన దారుణం గురించి తెలుసుకుని అతడిని అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించగా మహదేవ్ అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. పదిహేనేళ్ల ప్రాయంలో బైక్ కోసం మహదేవ్ తీసుకున్న కఠిన నిర్ణయం అతడి తల్లిదండ్రులకు పుత్ర శోకాన్నే మిగిల్చింది.

Trending News