ప్రణయ్ హత్య కేసుకి ఐఎస్ఐ లింక్స్, హంతకుడికి కోటి రూపాయల సుపారీ ?
ప్రణయ్ హత్య కేసులో హంతకుడు సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసు విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రణయ్ని హత్య చేసిన గ్యాంగ్కి పాకిస్తానీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలీజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలున్నాయని, ఈ హత్య కోసం గ్యాంగ్కి రూ. 1 కోటి సుపారీ చెల్లించినట్టు తెలిసిందని పోలీసులు చెప్పినట్టుగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ హత్య కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా ఇప్పటికే నిందితుడికి రూ.18 లక్షలు సైతం ముట్టజెప్పినట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సదరు కథనం పేర్కొంది.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హంతకుడికి 2003 నాటి గుజరాత్ మాజీ మంత్రి హరెన్ పాండ్య హత్య కేసులో శిక్షపడి, తర్వాత విడుదలైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఏర్పాటు చేయనున్న ప్రెస్ మీట్లో ఈ హత్య కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీడియా ముందుకొచ్చే అవకాశం ఉంది.
ప్రణయ్ హత్య కేసుకి ఐఎస్ఐ లింక్స్, హంతకుడికి కోటి రూపాయల సుపారీ ?