మూసి కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఏడుగురు మృతి

మూసి కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

Last Updated : Jun 24, 2018, 01:40 PM IST
మూసి కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఏడుగురు మృతి

ఓవైపు కర్నూలు జిల్లాలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు చనిపోయిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరోవైపు తెలంగాణలోనూ మరో రోడ్డు ప్రమాదం ఇంకో ఏడుగురిని బలి తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వలిగొండకు సమీపంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములకొండకు దగ్గరలోని మూసీ నది కాలువలో ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మూసీ కాలువపై వెళ్తోన్న ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న వారిలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న వాళ్లంతా వ్యవసాయ కూలీలే. కూలీ పనుల కోసం ట్రాక్టర్‌లో వెళ్తూ ప్రమాదంబారినపడ్డారు. 

ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంభందించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Trending News