సల్మాన్ ముస్లిం కాబట్టే శిక్షించారు: పాక్ మంత్రి

సల్మాన్ ఖాన్ ముస్లిం కాబట్టే.. భారత ప్రభుత్వం అతన్ని శిక్షించిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అబ్బాస్ తెలిపారు. 

Last Updated : Apr 6, 2018, 04:18 PM IST
సల్మాన్ ముస్లిం కాబట్టే శిక్షించారు: పాక్ మంత్రి

సల్మాన్ ఖాన్ ముస్లిం కాబట్టే.. భారత ప్రభుత్వం అతన్ని శిక్షించిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అబ్బాస్ తెలిపారు. భారతదేశంలో పుట్టిన సల్మాన్ ఖాన్ హిందువుతే ఈ బాధ ఉండేదే కాదని.. అతన్ని కోర్టు వదిలేసేది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కచ్చితంగా ముస్లింలపైన వివక్షగానే భావించాల్సి ఉంటుందని.. భారత్‌లో సల్మాన్ ఒక మైనారిటీ కాబట్టే ఆయన పై వివక్ష చూపించారని ఖ్వాజా ఆసిఫ్ అబ్బాస్ అన్నారు.

దీని బట్టి భారతదేశంలో ముస్లిములకు, క్రిస్టియన్లకు ఎంత గౌరవం ఉందో తెలుస్తుందని అబ్బాస్ పేర్కొన్నారు. ఖ్వాజా ఆసిఫ్ అబ్బాస్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. డిసెంబర్ 31, 2015న అంతర్జాతీయ సరిహద్దులో చర్చలకు రమ్మని పిలిచి... ఇద్దరు పాక్ రేంజర్లను భారత ఆర్మీ అధికారులు దారుణంగా చంపేశారని గతంలో ఖ్వాజా ఆసిఫ్ ఆరోపించారు. అప్పుడు ఆయన పాకిస్తాన్‌లో రక్షణ మంత్రిగా ఉన్నారు. 

 

Trending News