)
DSC Job Holders: ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ-2025లో విజయం సాధించిన 75 మంది అభ్యర్థులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఘనంగా సత్కరించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో డీఎస్సీ–2025లో ఉపాధ్యాయులుగా, భాషా పండితులుగా, ఫిజికల్ డైరెక్టర్లుగా ఎంపికైన 75 మంది అభ్యర్థులను తొలిసారిగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించారు.
కార్యక్రమం ఉదయం కొత్తగా ఎన్నికైన టీచర్లతో అల్పాహారంతో ప్రారంభమైంది. అనంతరం సభలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు తమ అనుభవాలు, కష్టాలు, ప్రయాణాన్ని పంచుకున్నారు. తరువాత ప్రతి అభ్యర్థిని సభలో పిలిచి ఎమ్మెల్యే సతీమణి శ్రీరామ్ శ్రీదేవి అమ్మాజీ నుదుటి తిలకం దిద్ది.. దంపతులు ఇద్దరూ శాలువాలతో సత్కరించారు. అదనంగా మహిళా అభ్యర్థులకు చీరలు, పురుషులకు దుస్తులు అందజేశారు. జీవితాంతం గుర్తుండే గుర్తింపుగా సర్వీస్ రిజిస్టర్ కూడా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ.. అన్ని వృత్తులలో తనకు అత్యంత ఇష్టమైనది ఉపాధ్యాయ వృత్తి అని తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు సమాజాన్ని తీర్చిదిద్దగలడని చెప్పారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చగలడని పేర్కొన్నారు. జగ్గయ్యపేటలో 75 మంది కొత్త ఉపాధ్యాయులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. అందరూ ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచి.. విద్యార్థులకు వెలుగునిచ్చే మార్గదర్శకులుగా నిలవాలని ఆకాంక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook