)
Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తుగా ప్రవేశించినా ఆ తరువాత మందగించడంతో మిశ్రమ వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు భారీగా మండుతుంటే మరి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతుంటే మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి.
గత వారం రోజులుగా నైరుతి రుతు పవనాలు బలహీనపడటంతో ఎండలు పీక్స్కు చేరాయి. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు అధికంగా ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడుతోంది. మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అటు ఏపీలో కూడా ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. ఇతర జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. గత కొద్ది రోజులుగా నైరుతి రుతు పవనాలు గమనం బలహీనంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
అయితే తాజాగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం కన్పిస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో రానున్న 3 రోజులు వర్షాలు పడనున్నాయి. మూడ్రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుంది. మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఆవహించి ఉంది. ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మేర మరో ద్రోణి ఏర్పడింది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook