)
Babu on Polavaram:2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఆయన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర విభజన వేళ అనేక సమస్యలు వచ్చినా నిలదొక్కుకున్నామన్నారు. ఐదేళ్లలో మనం ఏం చేయాలనేదానిపై ఇప్పటికే చర్చించాం. ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని. ప్రజల ఆకాంక్షలను మనం నెరవేర్చాలని స్పష్టం చేశారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు మనం ఎప్పుడూ చేయమన్నారు. కేంద్రం మనకు బాగా సాయం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. రాజధాని ప్రాంతంలో పనులను పట్టాలెక్కించామన్నారు. పోలవరానికి రూ. 12 వేల 500 కోట్లు కేంద్రం ఇచ్చిందని... రాబోయే ఏడాదిన్నరలో ఆ ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి జాతికి అంకితం చేస్తామని భరోసా ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.