)
Andhpra Pradesh Cyclone Effect: ఆంధ్ర ప్రదేశ్ లో మొన్నటి వరకు మొంథా తుపాను వణికిణించింది. ముఖ్యంగా ఈ తుపానలన్ని నవంబర్ లోనే ఏర్పడినవే. దివిసీమ నుంచి మొదలు పెడితే.. దాదాపు అన్ని తుపానులు నవంబర్ లో నెలలో ఏర్పడి పెను నష్టాన్ని కలిగించాయి. రీసెంట్ గా మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మరోవైపు మొంథా తుపాను తీరం దాటకుండానే పెను ప్రమాదం తప్పింది.
అది మరిచిపోయే లోపే బంగాళాఖాతంలో వాయుగుండం ఏపీ వాసులను కలవరపెడుతుంది. ఈనెల 30 నాటికి తుఫానుగా మారే అవకాశాలున్నాయంటోంది వాతావరణ శాఖ. దీంతో ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ నెల 26 నుంచి APలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. 28 నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయంటోంది భారత వాతావరణ శాఖ. ఇక ఆవర్తన ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.