Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించరా.. మీ జేబుకు చిల్లే..

Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ సహా ఏ రూల్ అయినా పాటించడానికే ఉన్నాయి. కానీ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో పాటు ప్రజలు గీత దాటితే ఏమి కాదనే ఉద్దేశ్యంతో ట్రాఫిక్స్ రూల్స్ పాటించకుండా ఇస్టమొచ్చినట్టు వాహనాలు నడుపుతున్నారు. దీంతో వాహన ప్రమాదాలు కూడా తరుచు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఏపీలో ట్రాఫిక్ రూల్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 2, 2025, 08:47 AM IST
Traffic Rules: ట్రాఫిక్ రూల్స్ పాటించరా.. మీ జేబుకు చిల్లే..

Traffic Rules:  ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.అంతేకాదు వాహానాలను ఇష్టమొచ్చినట్టు నడిపి అమాకులకు ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే అతిగాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ జరిమానాలతో చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇందు కోసం ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే వారి కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హై రెజల్యూషన్ కెమెరాలను ఉపయోగించనున్నారు.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో APలో ట్రాఫిక్ సమస్యలు, తలెత్తే ప్రమాదాలపై  కూటమి ప్రభుత్వం  దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే  ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై భారీగా ఫైన్‌ విధించబోతుంది.  మార్చి  1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స ప్రకారం  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వాహనదారులకు రూ. 10 వేల జరిమానాతో పాటు లైసెన్స్ కూడా జీవిత కాలం రద్దు చేస్తున్నారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

దీంతో పాటు హెల్మెట్  లేకుండా  బైక్ నడిపితే రూ. వెయ్యి.. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కార్లు నడిపితే రూ. 1000 జరిమానా వేయనున్నారు.   ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడం వంటి కేసుల్లో రూ.వెయ్యి వరకు జరిమానా విధించనున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారి పట్ల కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నారు.  వారికి రూ.5 వేల జరిమానాతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేస్తామంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు .

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News