)
AP Government: ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్ధులకు అద్బుతమైన అవకాశం అందిస్తోంది. ఇప్పటి వరకు లేని అవకాశం ఇస్తోంది. ఇకపై ఏపీలో విద్యార్ధులు ఇంటర్ తరువాత నీట్, జేఈఈ రెండూ రాసుకోవచ్చు. ఎంబైపీసీ గ్రూప్ ద్వారా ఇంటర్లో మేథ్స్ , బయోలజీ కలిపి చదువుకోవచ్చు.
ఇప్పటి వరకూ ఇంటర్లో ఎంపీసీ చదివితే ఇంజనీరింగ్ వైపు బైపీసీ చదివితే మెడిసిన్ వైపు వెళ్లేవాళ్లు. అంటే నీట్ లేదా జేఈఈ ఏదో ఒకటే రాసేందుకు అవకాశం ఉండేది. ఇంటర్లో ఇప్పటి వరకూ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ మెడిసిన్పై ఆసక్తి ఉంటే బైపీసీ లేదా గణితం ఇంజనీరింగ్ ఆసక్తి ఉంటే ఎంపీసీ గ్రూప్ తీసుకునేవాళ్లు. రెండూ ఆసక్తి ఉంటే మాత్రం అవకాశం ఉండేది కాదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ కళాశాలల్లోనే ఈ గ్రూప్ అందుబాటులో ఉంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటి వరకు ఈ ఆప్షన్ లేదు.
ఈ విద్యా సంవత్సరం నుంచి 2025-26 నుంచి ఏపీలో ఎంబైపీసీ గ్రూప్ తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు రెండింటికీ ఇది వర్తించనుంది. ఇప్పటికే ఎంబైపీసీ అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్ధుల కెరీర్ అవకాశాలు మరింతగా మెరుగుపర్చేందుకే ఎంబైపీసీ గ్రూప్ తీసుకొచ్చినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మేథ్స్ , సైన్స్ రెండూ ఆసక్తి ఉండి కెరీర్ ఏది బాగుంటే అది ఎంచుకునేలా ఉండేందుకు ఎంబైపీసీ గ్రూప్ ఎంచుకోవచ్చు. ఈ గ్రూప్లో మేథ్స్, బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలుంటాయి. తద్వారా ఇంటర్ పూర్తి చేశాక నీట్ లేదా జేఈఈ రెండూ రాయడానికి వీలుంటుంది.
ప్రస్తుతం ఎంబైపీసీ గ్రూప్ సీబీఎస్ఈలో మాత్రమే ఉంది. కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయాల్లో కొన్నిచోట్ల ఈ గ్రూప్ అందుబాటులో ఉంది. ఎంబైపీసీ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. మిగిలిన గ్రూపులు తీసుకునేవారికి ఐదు సబ్జెక్టులుంటే ఎంబైపీసీ గ్రూప్లో ఆరు సబ్జెక్టులు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి