AP Government: ఏపీ మెగా డీఎస్సీ నోటిపికేషన్లో భాగంగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్ని ఇకపై పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఏటా
డీఎస్సీ నోటీఫికేషన్ వెలువరిస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి రోజుకు రెండు సెషన్లలో ప్రారంభమయ్యాయి. జూలై 6 వరకు కొనసాగనున్నాయి. ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 4 వేలమందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు. కేరళ తరహాలో నూటికి నూరుశాతం అక్షరాస్యతకు కృషి చేస్తున్నామన్నారు. ఏపీలో నిరక్షరాస్యత 19 శాతం ఉంది. రాష్ట్రంలో 81 శాతం నిరక్షరాస్యులు ఉన్నారు. వయోజన విద్యను ప్రోత్సహించేందుకు అక్షరాంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. రాష్ట్రంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా 3.95 లక్షల మంది పరీక్షలు రాయగా 90 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు.
అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ను టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలన్నదే తమ ధ్యేయమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వయోజన విద్య మిషన్ తక్షణమే ప్రారంభించి, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకు చర్యలు తీసుకోనున్నారు.
Also read: AP Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్, జూన్ 10 వరకూ ఆ సేవలు బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook









