Andhra Pradesh Free Bus Scheme: ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు..

Andhra Pradesh Free Bus Scheme: 2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామిలతో తెలుగు దేశం కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరి అపుడే ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో తమ హామిల్లో ముఖ్యమైనది మహిళలకు ఉచిత బస్సు పథకం. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో ఈ పథకం పూర్తిగా విఫలమైంది. కానీ ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ లో భాగంగా ఈ పథకాన్ని వచ్చే తెలుగు నూతన సంవత్సరాది నుంచి అమలు చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 31, 2024, 01:17 PM IST
Andhra Pradesh Free Bus Scheme: ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు..

Andhra Pradesh Free Bus Scheme: ఆంధ్ర ప్రదేశ్ లో  అధికారంలోకి వస్తే మహిళల కోసం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తామని సూపర్ సిక్స్ ఎన్నికల హామిల్లో భాగంగా వాగ్ధానం చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి సర్కారు.. ఎలక్షన్స్ ముందు ఏపీ సర్కార్ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధం అవుతోంది.  తెలుగు ప్రజల కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.

Add Zee News as a Preferred Source

ఉమ్మడి జిల్లా పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లయినా, రోజుకు ఎంత దూరం ప్రయాణించినా టికెట్‌ కొనాల్సిన అవసరం ఉండదట. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై  సమీక్షించారు. ఈ నేపథ్యంలో జరిగే లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికీ ఈ పథకం మూలానా.. కర్ణాటకలో, తెలంగాణలో అక్కడి ప్రభుత్వాలు  అన్ని వర్గాల మహిళలకు ఆధార్ కార్డు ఉంటే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి. దీని మూలంగా పురుషులకు బస్సుల్లో సీట్లు దొరకడం లేదు. దీంతో పురుషులను నుంచి స్టూడెంట్స్ నుంచి ప్రభుత్వానికి  ప్రజా వ్యతిరేకత ఎదురువుతున్నఅయి.  ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంతో తమకు గిరాకీలు లేవు అంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే కదా. మరి ఏపీలో ఈ పథకం అమలులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి.
 
ఇప్పటికే సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ‘మహిళలకు ఇచ్చిన హామీల్లో ఉచిత గ్యాస్‌ సిలెండర్‌ పథకాన్ని ఇప్పటికే అమలు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయాలని అధికారులకు సూచించారు చంద్రబాబు నాయుడు. APSRTC ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో సరాసరి 69 శాతం వరకూ ఉందని, మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు  తెలిపారు. ఉచిత ప్రయాణం అమలుతో ప్రభుత్వంపై ప్రతి నెలా  రూ. 265 కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్‌, ఢిల్లీలో ఉచిత బస్సు ప్రయాణం ను సీఎంకు వివరించారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏది ఏమైనా ఉగాది నుంచి ఈ పథకాన్ని ఎలాగైనా అమలు చేయాలనే కృత నిశ్చయంతో కూటమి సర్కారు ఉంది.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News