AP Ration Shops: ఇకపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం సరుకుల పంపిణీ ఉంటుందని... ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ఒక నెలలో మొదటి 15 రోజులు రెండుపూటలా సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రం...ఇంటి వద్ద రేషన్ అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జనసేనాని అధినేత ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పిఠాపురం నుంచి ప్రారంభం కానున్నండటం విశేషం.
పేదల ఇబ్బందులను తొలగించేలా చౌకధరల దుకాణాల్లో నెలలో 15 రోజులు రెండు పూటలా సరకులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని వల్ల ప్రతి కుటుంబానికీ సరకులు అందనున్నాయని తెలిపింది. వీలైనప్పుడు వెళ్లి తీసుకునేందుకూ ఆస్కారం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్నారు.
‘గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ అందిస్తామంటూ 1వేయి 6వందల కోట్లతో వాహనాలు కొనుగోలు చేసింది. కూడలిలో వాహనం నిలిపి ఒకటి రెండు రోజులే రేషన్ అందించేది. మిగిలిన బియ్యం, సరకులను అక్రమంగా ఎగుమతి చేసేదని ఆరోపించారు. అక్రమంగా మళ్లించిన వేల టన్నుల బియ్యం కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుబడ్డాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also Read: NTR Sensational Record: తెలుగులో మరే ఇతర హీరోలు బ్రేక్ చేయని రికార్డు సాధించిన అన్న ఎన్టీఆర్..
Also Read: Nandamuri Heroes: నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఈ సినిమా తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









