)
Gold and Diamonds: ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువైన ఖనిజ సంపద కోసం ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఖనిజాల అణ్వేషణ కోసం వివిధ సంస్థల్ని ఆహ్వానిస్తోంది. ఖనిజ సంపదను గుర్తించినవారికే లీజులు మంజూరు కానున్నాయి. అదే జరిగితే ఇక పంట పండినట్టే.
ఏపీలోని శ్రీ సత్యసాయి, అనంతపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ఖనిజాల్ని వెలికి తీసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానిస్తూ ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. జూన్ 6 వరకూ బిడ్లు స్వీకరించనున్నారు. కేంద్ర గనుల శాఖ ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. మొత్తం ఏడు బ్లాకులకు టెండర్లు పిలిచింది. ఇందులో బంగారం, వజ్రాలతో పాటు మాంగనీస్, సున్నపురాయి నిక్షేపాల అణ్వేషణ ఉంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు ముందు నిక్షేపాలను గుర్తించి, ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. టెండర్ దక్కించుకున్న సంస్థలు ఖనిజ సంపదను గుర్తించి నివేదిక సమర్పిస్తే లీజులు కూడా మంజూరవుతాయి.
ఏయే జిల్లాల్లో ఏ ఖనిజాల అణ్వేషణ
విజయనగరం జిల్లాలోని శివన్నదొరవలసలో 420 హెక్టార్లు, పెద్దలింగవలసలో 472 హెక్టార్లలో మాంగనీస్ కోసం తవ్వకాలు జరిపి గుర్తించాల్సి ఉంది. మిగిలిన మూడు జిల్లాలు రాయలసీమ ప్రాంతంలోనివి. శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలో నార్త్, సౌత్ బ్లాక్స్ లో బంగారు నిక్షేపాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం 1000 హెక్టార్ల స్థలాన్ని కేటాయించి కాంపౌండింగ్ లైసెన్స్ మంజూరు చేయనున్నారు. ఇక అనంతపురం జిల్లా పెన్నా ఆహోబిలం వద్ద వజ్రాల అణ్వేషణ కోసం 100 హెక్టార్లలో తవ్వకాలు జరపనున్నారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోని మైలవరంలో మాధవపురంలో 697 హెక్టార్లు, పెద్దముడియం మండల పరిధిలోి భీమగుండంలో 698 హెక్టార్లలో సున్నపురాయి నిక్షేపాల కోసం అణ్వేషించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి