AP Inter Results: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు పూర్తయి 15 రోజులవుతోంది. మార్చ్ 1 నుంచి మార్చ్ 15 వరకూ ఈ పరీక్షలు పూర్తి కాగా వ్యాల్యుయేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఈసారి గతానికి భిన్నంగా వాట్సప్ ద్వారా ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీ ఇంటర్ పరీక్షలు 2025 ఫలితాల కోసం విద్యార్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ 15కు పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఏప్రిల్ 6 వరకూ ఈ ప్రక్రియ జరగనుంది. ఆ తరువాత మార్కుల కంప్యూటరీకరణ జరగనుంది. ఇది పూర్తయిన తరువాత అధికారికంగా ఏప్రిల్ 12-15 తేదీల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. ప్రతిసారీ ఆన్లైన్ విధానంలో ఫలితాలు వెలువడుతుంటాయి.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్ https://bieap.apcfss.in/ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈసారి అధికారికంగా వాట్సప్ ద్వారా విడుదల కానున్నాయి. వాట్సప్ ద్వారా మార్కుల మెమో పీడీఎఫ్ రూపంలో ఉంటుంది.
Also read: School Holidays: విద్యార్ధులకు బంపర్ న్యూస్, ఏప్రిల్లో అన్నీ సెలవులే, సమ్మర్ హాలిడేస్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









