)
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలలో రాబోయే రెండు లేదా మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురువనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారాలు తెలియజేశారు. కోస్తాలో అన్నీ జిల్లాలలో పాటు కర్ణాటక గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడులోని కొన్ని రాష్ట్రాల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బుధవారం (సెప్టెంబరు 10) నుంచి రెండు లేదా మూడు రోజుల పాటు కోస్తాలోని ఏలూరు, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అలాగే శుక్రవారం (సెప్టెంబరు 12) నాడు ఇతర జిల్లాలైన ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
అదే విధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాల్లో గురువారం నాడు (సెప్టెంబరు 11) గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటం వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లరాదని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook