Amaravati: 2014లో అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఎన్నో కసరత్తుల తర్వాత పార్లమెంట్ లో చట్టం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసింది. దీనికి అప్పటి ప్రతిపక్షం ఇప్పటి పాలక పక్షంలో ఎన్డీయే సారథి బీజేపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే.. విభజన తర్వాత ఏపీకి ఇప్పటికీ పూర్తి స్థాయి రాజధాని లేకుండా పోయింది. 2014 విజయ దశమి రోజున చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత పనులు శరవేగంగా జరుగుతాయనుకున్న టైమ్ లో తెలుగు దేశం పార్టీ బీజేపీతో తెగ తెంపులు చేసుకొని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వెసీపీ ప్రభుత్వం అమరావతిని కొనసాగిస్తూనే మూడు రాజధానులను ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
విశాఖ పట్నం కార్యనిర్వాహక రాజధాని అయితే.. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా అక్కడ ప్రజలు ఆమోదించలేకపోయారు. దీంతో 2024లో మళ్లీ బీజేపీ, తెలుగు దేశం, జనసేన కూటమికి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. జగన్ హయాములో ఆగిపోయిన పనులకు ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం తిరిగి శ్రీకారం చుట్టబోతుంది.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 15న లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు అమరావతిలో ఒకే రోజు శ్రీకారం చుట్టనున్నారు. మూడేళ్లలో అన్ని నిర్మాణాలు పూర్తి చేసేలా చంద్రబాబు సర్కార్ ప్రణాళిక రచించింది. పలు పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రధాని మోడీ పర్యటనలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









