
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగ మండుతుంటే మరి కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కొనసాగుతోంది. దాంతో రానున్న 3 రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరో వైపు ఇవాళ్టి నుంచి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి.
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం , ద్రోణి కారణంగా ఏపీలో వచ్చే ఐదు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు, పిడుగులు ప్రజల్ని భయబ్రాంతుల్ని చేస్తున్నాయి. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో పిడుగుల హెచ్చరిక జారీ అయింది. అదే సమయంలో ఇంకొన్ని జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరగనున్నాయి. కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి