)
AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఈ రోజు రేపు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు తీరం వెంబడి 40 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు చూసించారు.
వచ్చే వారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాలు కోస్తా తీర ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం చూపనుంది. మరోవైపు ఈ ఎఫెక్ట్ నెల్లూరు వరకు ఉండనుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనుంది.
గతంలో విజయవాడ వంటి ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అంతేకాదు వర్షపాతం నేపథ్యంలో విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయంతో పాటు సిగ్నల్స్ లేకపోవడంతో ప్రజలకు బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. ఈ సారి ముంపు ప్రాంతాల్లో ఏదైనా సమస్య తలెత్తితే స్థానిక యంత్రాంగంతో పాటు నేవిని కూడా రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడటంతో స్థానికంగా నేవి అధికారులు ఎటువంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొవడానికి అందుబాటులో ఉండనున్నారు. అంతేకాదు ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో పడవలను కూడా రెడీగా
ఉంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.