మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న వైసీపీ

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది

Last Updated : May 23, 2019, 10:35 AM IST
మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న వైసీపీ

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నాల్గో రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ కంటే వైసీపీ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం వైసీపీ 129 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. టీడీపీ 22 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా పరిణమంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. భారీ విజయం సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామం టీడీపీ శ్రేణుల్లో కాస్త నిరాశను మిగిల్చింది. అయితే అన్ని రౌండ్లు పూర్తయ్యే లోపు పుంజుకుంటామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు

Trending News