)
Ap Cm Chandrababu naidu released one da for govt employees: గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు తమకు డీఏ పెంపుదలపై క్లారిటీ ఇవ్వాలని చంద్రబాబు సర్కారును పలు మార్లు కలిసి తమ గొడును చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న డిమాండ్ లు, ప్రభుత్వం వద్ద ఉన్న ఫండ్స్ మొదలైన వాటిపై చర్చలు జరిపి మొత్తంగా ఇప్పుడైతే వెంటనే ఉద్యోగ సంఘాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏల్లో వెంటనే.. ఒక డీఏ విడుదల చేస్తామని ప్రకటించారు. నవంబర్ 1న డీఏ విడుదల అవుతుందన్నారు.
అదే విధంగా దీని వల్ల ప్రతి నెల రూ. 160 కోట్ల ఖర్చవుతుందన్నారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో పాటు ఉద్యోగులు మహిళ ఉద్యోగులు రిటైర్ అయ్యే వరకు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైన వాడుకొవచ్చన్నారు.
పోలీసు సిబ్బందికి సంబంధించిన ఈఎల్ బకాయిల్లో మొదటి విడతగా రూ. 105 కోట్లను తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరిలో చెల్లిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
దీనితో పాటు కిందిస్థాయి ఉద్యోగులకు డిసిగ్నిషన్ ప్రమోషన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇన్ స్టాల్ మెంట్ రూ. 105 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. 60 రోజుల్లోపు హెల్త్ కు సంబంధించిన వ్యవస్తను స్ట్రీమ్ లైమ్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నిర్వాహణలో కీలక భాగస్వామ్యమన్నారు.
డీఏలను పెండింగ్ లో పెట్టిన పాపం గత వైసీపీ ప్రభుత్వందే అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. సరెండర్ లీవ్స్కు రూ.730 కోట్ల బకాయిలు పెట్టారున్నారు. అదే విధంగా.. ప్రజలు, ఉద్యోగుల పక్షాన మా ప్రభుత్వం ట్రస్టీగా పనిచేస్తోందన్నారు.
గతంలో భవిష్యత్ ఆదాయాలు చూపించి భారీగా అప్పులు తెచ్చాయన్నారు. ప్రభుత్వ ఆదాయంలో జీతాలకే ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఏపీలో ఏం జరుగుతోందో ప్రజలతో పాటు ఉద్యోగులకూ తెలియాలన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు సమయానికి జీతాలు, పెన్షన్లు వస్తున్నాయన్నారు.
గతంలో ఆగిపోయిన కేంద్ర పథకాలను పునరుద్ధరించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తమపై ఎంత ఒత్తిడి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అన్నిరకాలుగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరోవైపు దీపావళికి ముందు చంద్రబాబు నాయుడు డీఏ, ప్రమోషన్లు తదితర ప్రకటనలో ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.