ఢిల్లీకి సీఎం జగన్ 2 రోజుల పర్యటన ?

ఢిల్లీకి సీఎం జగన్ 2 రోజుల పర్యటన ?

Last Updated : Oct 10, 2019, 05:45 PM IST
ఢిల్లీకి సీఎం జగన్ 2 రోజుల పర్యటన ?

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, అమిత్‌ షాతో భేటీ ఖరారైనప్పటికీ.. ప్రధానితోనే భేటీపై ఇంకా ఓ స్పష్టత రాలేదని వార్తలొస్తున్నాయి. ఒకవేళ శుక్రవారం ఈ ఇరువురిలో ఎవ్వరిని కలవడం కుదరకపోయినా.. అవసరమైతే శనివారం కూడా జగన్‌ ఢిల్లీలోనే ఉండొచ్చనేది ఆ వార్తల సారాంశం. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. 

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, అపరిష్కృత సమస్యలు, నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.

Trending News