)
AP DSC 2025: ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలు రేపు జూన్ 6 నుంచి ప్రారంభమౌతున్నాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున జూలై 6 వరకు నెలరోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ 2025 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు జూన్ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజులు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 154 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా పరీక్షలకు అనుమతించమని ఏపీ విద్యాశాఖ తెలిపింది. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోనే తప్పులు సరిచేయనున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం ఇతర వివరాలు తప్పుగా నమోదైతే ఆధారాలను చూపిస్తే సరి చేస్తారు.
ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డు, పాన్ కార్డు వంటి ధృవీకరణ పత్రాల్ని చూపించాల్సి ఉంటుంది. ఏపీ డీఎస్సీ పరీక్షలకు ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రిన్సిపాల్, పీజీటీ, పీడీ పోస్టులకు పరీక్ష మూడు గంటలు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది.
మొత్తం 16,347 పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 3,35,401 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పోస్టులకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. డీఎస్సీ పరీక్షలు పూర్తయిన వారం రోజుల్లో ప్రాధమిక కీ విడుదలవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook