)
Jagan Court: వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడిగా వర్చువల్ గా కోర్టుకు హాజరవుతున్న వై.యస్. జగన్ ఇపుడు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకాబోతున్నారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. దాదాపు 12 సంవత్సరాలపాటు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై బయట తిరుగుతున్నారు.
ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టులో వైయస్ జగన్ హాజరు కాబోతుండటంతో ముందస్తుగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కోర్టు పరిసరాల్లో వైసీపీ శ్రేణులు ఎక్కడా గూమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2014లో విభిజిత ఆంధ్ర ప్రదేశ్ తొలి ప్రతిపక్ష నేతగా రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు. గత 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనంలో వైయస్ఆర్సీపీ కొట్టుకుపోయింది. కేవలం ప్రతిపక్ష స్థానం దక్కుండా 11 స్థానాలకే పరిమితమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.