)
Bharathi Cement News: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో కేంద్ర గనుల శాఖ నిబంధనలను ఉల్లఘించి మరీ భారతి సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులు లీజుకు ఇచ్చినట్లు తేలింది. దీంతో ఆ సంస్థకు ఇచ్చిన వాటితో పాటు మొత్తం నాలుగు లీజులను రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది.
అయితే రద్దు చేయనున్న 4 లీజుల్లో 2 భారతి సిమెంట్తో పాటు అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ (ACC), రామ్కో సిమెంట్స్కు చెందిన ఒక్కొక్క లీజు కూడా ఇదే రద్దు ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. ఈ నాలుగు లీజుల రద్దుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలోనే జారీ చేయనున్నారు.
రద్దు ప్రక్రియ, నోటీసులు
ప్రభుత్వం ఈ వారం రోజుల్లో భారతి సిమెంట్తో పాటు ఇతర కంపెనీల యాజమాన్యానికి తాఖీదులు జారీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఈ నోటీసులు అందుకున్న తర్వాత ఆయా కంపెనీలు తమ వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఉంటుంది. అయితే కేంద్ర గనుల శాఖ ఆదేశాల మేరకు.. ఆయా కంపెనీలు ఇచ్చే వివరణతో సంబంధం లేకుండా ఈ నాలుగు సున్నపురాయి లీజులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. లీజులు రద్దైన తర్వాత.. ఆ గనులకు ప్రభుత్వం ఈ-వేలం నిర్వహించనుంది.
లీజుల కేటాయింపులో ఉల్లంఘనలు
2015లో కేంద్ర గనుల శాఖ నిబంధనలు సవరించింది. దీని ప్రకారం.. మేజర్ మినరల్స్ లీజులను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలి. పాత పద్ధతిలో దరఖాస్తు ద్వారా కేటాయించే విధానాన్ని రద్దు చేసింది.
భారతి సిమెంట్ కేసు..
వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో సున్నపురాయి గనులకు చెందిన ఈ రెండు లీజుల ప్రాథమిక అనుమతులు (LOI - Letter of Intent) 2008లో 'రఘురాం సిమెంట్స్ లిమిటెడ్'కు జారీ అయ్యాయి.
ఈ లీజులను భారతి సిమెంట్ 2009లో కొనుగోలు చేసింది. LOI జారీ అయిన రెండేళ్లలోపు మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతులు వంటివి పొందకపోతే LOIలు రద్దయినట్లేనని 2015 సవరణ నిబంధనలు చెబుతున్నాయి. అన్ని అనుమతులు పొందలేకపోయినప్పటికీ, భారతి సిమెంట్కు అప్పటి వైకాపా ప్రభుత్వం న్యాయ వివాదాలను ఉపయోగించుకుని పాత విధానంలోనే 2024, ఫిబ్రవరి 2న లీజులను మంజూరు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఏసీసీ, రామ్కో సిమెంట్స్ లీజులు:
ఏసీసీ (మైలవరం), రామ్కో సిమెంట్స్ (జయంతిపురం) కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో, 2015 తర్వాత వేలం లేకుండా పాత LOIల ఆధారంగా 2023, 2024లో లీజులను పొందినట్లు ప్రభుత్వ ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ రెండు లీజులను కూడా రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కేంద్రం ఆదేశాలతో రద్దు దిశగా అడుగులు
2015 తర్వాత వేలం ద్వారానే లీజులు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ.. 2023, 2024లలో పాత పద్ధతిలో లీజులు కేటాయించడంపై కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అన్ని అంశాలు పరిశీలించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, లీజులు రద్దు చేయడమే ఏకైక చట్టపరమైన మార్గం అని నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుత అడ్వొకేట్ జనరల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook