AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. ఏపీలో విలయం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు నెమ్మదించింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా 3 వేలలోపు కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్నించి కేవలం 2 వేల 5 వందలకు చేరువలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 84 వేల 858 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించగా..2 వేల 252 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరోవైపు 2 వేల 440 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 256 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 19 లక్షల 54 వేల 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..19 లక్షల 19 వేల 354 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేల 15 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.


గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 385 కొత్త కేసులు నమోదు కాగా..చిత్తూరులో 316, నెల్లూరులో 269, ప్రకాశం జిల్లాలో 241, పశ్చిమ గోదావరి జిల్లాలో 222 కేసులు నమోదయ్యాయి. 


Also read: Covid Va5ccination: ఏపీలో వేగవంతమవుతున్న కరోనా వ్యాక్సినేషన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook