)
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ - ఒడిశా రాష్ట్ర తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంపై ఉపరీతల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మంగళవారం (సెప్టెంబరు 2)న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా తూర్పు గాలులు బలంగా వీచే అవకాశం ఉండడంతో తీర ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తులు శాఖ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
నేడు (సెప్టెంబరు 1) ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు కాకినాడ, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వీటితో పాటు కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఉపరీతల ఆవర్తన ప్రభావంతో తీరం వెంట గంటకు 40–60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అల్పపీడనం రాబోతున్న తరుణంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని..విద్యుత్ శాఖతో పాటు వరదల ప్రమాదాల నుంచి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook